Breaking News

100వ టెస్టులో 100 బాదాడు

0 0

ఇంగ్లండ్ సారథి జో రూట్ టెస్టు క్రికెట్‌లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. చెన్నైలో చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ (128 బ్యాటింగ్) రెచ్చిపోయాడు. వందో టెస్టు ఆడుతున్న అతడు సెంచరీ బాదేశాడు. టెస్టుల్లో రూట్‌కిది 20వ సెంచరీ. ఈ ఏడాది వరుసగా అతడికి ఇది మూడో సెంచరీ. శ్రీలంకలో రెండు టెస్టుల్లోనూ రూట్ రెండు సెంచరీలు (228, 186) చేశాడు. కాగా ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్. బర్న్స్ (33), లారెన్స్ (0) తక్కువ స్కోర్లకే అవుటైనా సిబ్లే (87)తో కలిసి జో రూట్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు 2 వికెట్లు దక్కగా అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది.