Breaking News

తొలిరోజు ఆస్ట్రేలియాదే

0 0

సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. వార్నర్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు. కానీ తర్వాత వర్షం తొలి రోజు ఆటకు అంతరాయం కలిగించింది. లంచ్ తర్వాత కాసేపటికి ప్రారంభమైన ఆటలో ఆసీస్ పుంజుకుంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పిదాలు కూడా ఆసీస్ జట్టుకు వరంగా మారాయి. ముఖ్యంగా యువ ఆటగాడు పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పంత్ జారవిడిచాడు. దీంతో పకోస్కీ 62 పరుగులతో రాణించాడు. అనంతరం లబుషేన్, స్మిత్ జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 166/2 స్కోరుతో నిలిచింది. భారత బౌలర్లలో సిరాజ్, సైనీ తలో వికెట్ సాధించారు.

-->