Breaking News

రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే

0 0

చెపాక్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు రూట్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ రెండోరోజు రూట్ డబుల్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. రూట్ (218), స్టోక్స్ (82) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్-2, బుమ్రా-2, అశ్విన్-2, నదీమ్-2 వికెట్లు సాధించారు. బెస్ (28), లీచ్ (6) క్రీజులో ఉన్నారు. మూడోరోజు నుంచి స్సిన్నర్లకు స్పిచ్ సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో ఆసక్తిగా మారింది.