Breaking News

నామినేషన్స్‌లో శివాజీపై రైతు బిడ్డ ప్రశాంత్ ఫైర్

2 0

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ క్రియేటివ్‌గా జరుగుతున్నాయి. 12వ వారం నామినేషన్స్‌ను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న చికెన్ ముక్కను సింహం నోట్లో పెడితే.. వారు నామినేట్ అయినట్టు అని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో కంటెస్టెంట్లు తమ నామినేషన్స్‌ను వాడీవేడిగా ప్రారంభించారు. ఈ సీజన్‌లో శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఓ గ్రూప్‌గా ఆడటాన్ని అందరూ గమనించే ఉంటారు. అయితే సోమవారం నాటి నామినేషన్స్‌లో విచిత్రం చోటు చేసుకుంది. ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్తూ గౌతమ్ అతడిని నామినేట్ చేశాడు. గత వారం టాస్కులో బాల్ పడిపోతుంటే ఒకసారి యావర్ చేయితో ఆపాడని ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ గౌతమ్ చెప్పాడు. అయితే గౌతమ్ మాటను తప్పుబట్టిన యావర్.. తనను తాను సమర్థించుకోవడానికి ముందుకు వచ్చాడు. అలా చేయలేదని వాదించడం మొదలుపెట్టాడు. శివాజీ కూడా యావర్‌ను సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు. దీంతో ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ‘ఏంటన్నా నేను మాట్లాడుతుంటే మధ్యలో మొత్తం మీరే వస్తున్నారు. నాదా మీదా నాకు అర్థం కావట్లేదు’ అని శివాజీపై ఫైర్ అయ్యాడు.