Breaking News

100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు వద్దు: కేంద్రం

0 0

సినిమా థియేటర్లలో 100 శాతం సీట్ల కెపాసిటీకి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించలేదు. తక్షణమే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని హితవు పలికింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా 50 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు మాత్రమే అనుమతిచ్చిందని, ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించారని ఆ లేఖలో పేర్కొన్నారు.

-->