ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఈనాడు అధినేత రామోజీరావు నిర్మించిన ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ రానుంది. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. సోమవారం తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. తెలుగు సినిమా చరిత్రలో ‘చిత్రం’ సినిమా ట్రెండ్ సృష్టించింది. దివంగత నటుడు ఉదయ్ కిరణ్, హీరోయిన్ రీమాసేన్లకు ఇది తొలి సినిమా. యూత్ఫుల్ ఎంటర్టైనర్లకు ఈ మూవీ ఊపిరి పోసింది. లో బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. కాగా ‘చిత్రం 1.1’మూవీకి కూడా ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించనున్నాడు. ‘చిత్రం’ సినిమా కోసం పనిచేసిన 45మంది కొత్త టెక్నికల్ టీమ్ ఈ మూవీకి పనిచేయనుంది.