Breaking News

ప్రభాస్.. ఒకేసారి నాలుగు సినిమాలా?

1 0

డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. అటు ప్రభాస్ నటిస్తున్న రెండో సినిమా ‘సలార్’. కేజీఎఫ్‌ సినిమాతో ఓవర్ నైట్‌లో క్రేజీ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే గోదావరిఖని వంటి ప్రాంతంలో సలార్ షూటింగ్ ప్రారంభమైంది. మరో 10 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ సాగనుంది.

ఇక మూడో సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారమే ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ‘సలార్’, ‘ఆది పురుష్’ సినిమాల కోసం ప్రభాస్ సమానంగా డేట్లను కేటాయించినట్లు సమాచారం. అంటే నెలరోజులలో 15 రోజులు సలార్‌కు, 15 రోజులు ఆదిపురుష్‌కు కేటాయించాడన్నమాట. ఇక నాలుగో సినిమా నాగ్ అశ్విన్‌ది. వైజయంతి బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకపోయినా ప్రిపొడక్షన్ దశలో ఉంది. దీపికా పదుకునే ఇందులో హీరోయిన్. విచిత్రం ఏంటంటే ఈ నాలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం. ఈ చిత్రాల్లో రెండు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాధేశ్యామ్ వేసవికి రానుండగా.. సలార్ నవంబరులో రిలీజ్ కానుంది.