Breaking News

ప్రముఖ నిర్మాత MS రాజు నివాసంలో పెళ్లిసందడి

0 0

‘ఒక్కడు’, ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత MS రాజు నివాసంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే యువతిని ఈనెల 13న అశ్విన్ పెళ్లిచేసుకోనున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వీరి పెళ్లి జరగనుంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సుమంత్ అశ్విన్ వివాహానికి హాజరుకాబోతున్నారు. కాగా ‘తూనీగ తూనీగ’, ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘కేరింత’, ‘లవర్స్’ సినిమాలతో హీరో సుమంత్ అశ్విన్ మంచిపేరు సంపాదించుకున్నాడు.