Breaking News

‘ఆహా’లో చైతూ ‘లవ్‌స్టోరీ’.. ఎప్పుడంటే..?

1 0

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై మంచి కలెక్షన్‌లను రాబట్టింది. శేఖర్ కమ్ముల ఈ మూవీ ద్వారా ఆడపిల్లల గురించి ఓ సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాడు. దీంతో ఇది ఎమోషనల్ లవ్‌స్టోరీగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘లవ్‌స్టోరీ’ నిలిచింది. దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ లాభాలను కూడా మూటగట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ కొనుగోలు చేసింది. ఈ మేరకు అక్టోబర్ 22 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.