Breaking News

వైఎస్ జగన్ చేతికి టీవీ-9

1 0

తెలుగు మీడియాలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. టీవీ 9 నెట్‌వర్క్ సంస్థలో అత్యధిక వాటాలు ఏపీ సీఎం జగన్ చేతికి అందినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం టీవీ 9 టీఆర్ఎస్-బీజేపీ భాగస్వాముల చేతుల్లో ఉంది. వీరిలో మైహోం రామేశ్వరరావు ప్రముఖ వ్యక్తి. అయితే ఇటీవల వారికి చెందిన వాటాలను విక్రయానికి పెట్టగా… జగన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. టీవీ 9 నెట్‌వర్కుకు ఉన్న సమాచార బలం తమకు కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాక్షి మీడియా జగన్ చేతుల్లో ఉండగా తాజాగా సాక్షి అడుగు జాడల్లో టీవీ 9 నడవనుంది. తాజా పరిణామంతో వైసీపీ అనుకూల మీడియా మరింత విస్తృతం కానుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ సోషల్ మీడియాలో వైసీపీకి అండగా ఉండగా.. సాక్షి, టీవీ 9తో సహా గ్రేటాంధ్ర వంటి పలు వెబ్‌సైట్లు వైసీపీకి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తున్నాయి.

source: