Breaking News

చైతూతో విడాకులు ఫిక్స్.. సమంతకు భరణం ఎంతో తెలుసా?

2 0

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత జంట విడాకుల మ్యాటరే కనిపిస్తోంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పకపోయినా.. ప్రతిరోజూ సమంత పెట్టే ట్వీట్లు సూచికగా నిలుస్తున్నాయి. తప్పు చేశాను.. ఇద్దరు తప్పులు ఉన్నాయి అంటూ సమంత పెట్టిన ట్వీట్లు విడాకులు తీసుకుంటున్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత బోల్డ్‌గా నటించడంతోనే చైతూ-సమంత దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య లవ్‌స్టోరీ సినిమా ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నాడు. విడాకుల రచ్చ నడుస్తుండటంతో మీడియా ముందుకి కూడా తన వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు అన్న కండీషన్ మీదే చైతూ వస్తున్నాడట.

ఇకపోతే చైతూ-సామ్‌ మధ్య విభేదాల కారణంగా వాళ్లిద్దరినీ అక్కినేని ఫ్యామిలీ సభ్యులు చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించినా ఎలాంటి ఫ‌లితం లేద‌ట. చైతూ, సామ్ డివోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి కానుందని, స్థిర, చర ఆస్తులతో కలిపి సమంతకు భరణంగా రూ.50 కోట్లు ఇవ్వ‌నున్నారని కొంద‌రు చెబుతుంటే మ‌రికొంద‌రు రూ.250 నుంచి రూ.300 కోట్ల వ‌ర‌కు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. మ‌రి ఇందులోఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే చైతూ- సామ్‌ల‌లో ఒక‌రు స్పందించక త‌ప్ప‌దు.