Breaking News

రాధేశ్యామ్ షూటింగ్‌లో ప్రభాస్-పూజాహెగ్డే మధ్య విభేదాలు?

1 0

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల కాగా అందులో ప్రభాస్, పూజా మధ్య కెమిస్ట్రీ బాగుందని కామెంట్లు వచ్చాయి. ఆన్‌స్క్రీన్ మీద మెప్పించిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ మీదకు వచ్చేసరికి గొడవలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హై యాటీట్యూడ్, బిహేవియర్ వల్ల ప్రభాస్ చికాకు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ రోజా భర్త సెల్వమణి కూడా హీరోయిన్ పూజా హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సపోర్టింగ్ స్టాఫ్ చాలా మందిని తీసుకొచ్చి నిర్మాతలను ఇబ్బందికి గురి చేస్తుందని వాపోయాడు.

అయితే పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై రాధేశ్యామ్ టీమ్ స్పందించింది. ప్రభాస్‌, పూజా హెగ్డే మధ్య విబేధాలు అన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. వారిద్దరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారని, అప్రిషీయేట్ చేసుకుంటారని తెలిపింది. ప్రభాస్‌తోనే కాకుండా యూనిట్ సభ్యులందరితో పూజా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.