Breaking News

ఫోటో అదిరింది… ఎన్టీఆర్ షోకు గెస్ట్‌గా మహేష్‌బాబు

1 0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోతోంది. జెమినీ టీవీకి ఈ షో కారణంగా టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ షోకు నిర్వాహకులు అదనపు హంగులు దిద్దుతున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ లాంటి వారు ఈ షోకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ ఆహ్వానించి సందడి చేశాడు. ఈ షో సోమవారం ప్రసారం కానుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోలో పాల్గొంటున్నాడు. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రోమో విడుదల చేసి ఆ తర్వాత పూర్తి ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.