కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలమిచ్చేలా సమంత పనులు ఉంటున్నాయి. తొలుత తన పేరులో అక్కినేని పేరు తొలగించడం, గోవా టూర్కు ఫ్రెండ్తో వెళ్లడం, మామ నాగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరుకాకపోవడం.. ఇలా ఒక్కటేంటి.. చాలా పనులు చేసింది. అయితే తాజా మరోసారి విడాకుల వార్తలకు సమంత ఆజ్యం పోసింది. ఈరోజు లవ్స్టోరీ ట్రైలర్ను నాగచైతన్య విడుదల చేశాడు. ఆ ట్రైలర్ గురించి ట్విట్టర్లో ప్రస్తావిస్తూ కేవలం సాయిపల్లవిని మాత్రమే ట్యాగ్ చేసిన సమంత.. చైతూ గురించి అసలు ప్రస్తావించలేదు. ఈ ట్వీట్కు సాయిపల్లవి థాంక్యూ అంటూ రిప్లై కూడా ఇచ్చింది. దీంతో చైతూ ఏం పాపం చేశాడని సమంతని అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే చైతూ ట్వీట్నే కదా సమంత పిక్ చేసుకుంది అంటూ సమాధానం ఇస్తున్నారు.
మరోవైపు విడాకుల కోసం నాగచైతన్య, సమంత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో బయటకు తెలియకపోయినా.. ఇప్పటికే రెండు కుటుంబాల పెద్దలు వీరికి రాజీ కుదర్చడానికి తీవ్రంగా ప్రయతిస్తున్నారట. కానీ వారి చర్చలు సఫలం కావటంలేదని తెలుస్తోంది. దీంతో డైవర్స్ కావాలంటూ కోర్టుకు ఎక్కిన ఈ జంట విడాకుల కేసు ప్రస్తుతం కౌన్సిలింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.