Breaking News

చైతూ-సమంత విడిపోవడం ఖాయం.. హింట్ ఇచ్చిన నాగార్జున

1 0

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత డైవర్స్ తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. సమంత ఎప్పుడైతే తన పేరులో అక్కినేని అనే పేరు తీసేసిందో అప్పటి నుంచే ఈ రచ్చ మొదలైంది. అనంతరం కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాగార్జున బర్త్ డే వేడుకలకు సమంత హాజరుకాకపోవడం, ఇటీవల సమంత తన స్నేహితురాలితో మాత్రమే బోటింగ్ చేయడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. సోషల్ మీడియాలో డైవర్స్ గురించి పలు రకాలుగా వార్తలు వచ్చినా నాగచైతన్య, సమంత ఖండించలేదు. ఏదో పేరుకు సమంత మీడియా గురించి ఓ పోస్ట్ పెట్టి చేతులు దులుపుకుంది తప్ప చైతూతో విడిపోవడం లేదంటూ స్పష్టత ఇచ్చింది లేదు. దీంతో అభిమానులకు మరిన్ని అనుమానాలు కలిగాయి.

దీనికి తోడు తాజాగా బిగ్‌బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన నాగార్జున చైతూ-సమంత ఇష్యూ గురించి మాట్లాడతారని మీడియా ఆశించింది. అయితే ఆయన మీడియాను కలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా కరోనాను నాగ్ టీమ్ బూచిగా చూపెడుతోంది. ఒకవేళ మీడియాను కలిస్తే చైతూ-సమంత ఇష్యూ గురించే మాట్లాడాల్సి వస్తుందని నాగ్ తప్పించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అక్టోబర్ 6న చైతూ, సమంత పెళ్లి వార్షికోత్సవం జరగనుంది. అప్పటికల్లా ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.