Breaking News

అక్టోబ‌రు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘మధురపూడి గ్రామం అనే నేను’

0 0

మ‌నుషుల‌కి ఆత్మలు ఉన్నట్టే.. ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ ‘కత్తి’ ఫేమ్ మల్లి ద‌ర్శక‌త్వం వ‌హించారు. మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ స్వరాలు స‌మ‌కూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌రు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రక‌టించింది.

ఒక డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దామని ‘మధురపూడి గ్రామం అనే నేను’ అనే సినిమాను రూపొందించినట్లు దర్శకుడు మల్లి తెలియజేశాడు. ల‌వ్‌, ఫ్రెండ్‌షిప్‌, పాలిటిక్స్‌, యాక్షన్‌, ఎమోష‌న్ ఇలా ఒక ఊరిలో ఎమైతే ఎగ్జయిటింగ్ అంశాలు ఉంటాయో అవ‌న్నీ ఈ మ‌ట్టి క‌థ‌లో ఉన్నాయని తెలిపాడు. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ జరుగుతుందని.. రాజ‌మండ్రి, మ‌చిలీప‌ట్నం,హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన‌, ఆస‌క్తిక‌ర‌మైన ప్రదేశాల్లో షూటింగ్ జ‌రిపినట్లు వివరించాడు. ఈ కథకు హీరోగా శివ కంఠ‌మ‌నేని ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌ అని.. అతడు అద్భుత‌మైన న‌ట‌న‌ క‌న‌బ‌రిచారని చెప్పాడు. హీరోయిన్‌గా క్యాథ‌లిన్ గౌడ ఒక డిఫ‌రెంట్ పాత్రలో మెప్పిస్తుందన్నాడు. భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య, నూక‌రాజు ఇత‌ర ముఖ్య పాత్రల్లో న‌టించారన్నాడు. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠభరితంగా సాగుతూ త‌ప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అనే న‌మ్మకం ఉందని దర్శకుడు మల్లి పేర్కొన్నాడు.

కాన్సెప్ట్ ఓరియంటేష‌న్‌తో ఒక మంచి యాక్షన్ డ్రామాగా ఖ‌ర్చుకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగిందని నిర్మాతలు వెల్లడించారు. ఇటీవ‌లే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. అక్టోబ‌రు 13న ప్రపంచ వ్యాప్తంగా ‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వర‌లోనే ట్రైల‌ర్ విడుదల చేస్తామని తెలిపారు. శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య, నూక‌రాజు న‌టిస్తోన్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం మల్లి అందజేస్తున్నారు.