Breaking News

లోపం మీలో ఉందా? మీ వ్యవస్థలో ఉందా?: పవన్

0 0

ఏపీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గెరిల్లా వార్ ఫైర్ చేస్తున్నాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఎంత శక్తివంతమో దేశమంతా తెలుసు అని, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్‌లు, మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసులు, 2.6 లక్షల మంది వాలంటీర్లు ఉండగా విగ్రహాల ధ్వంసాలను ఆపలేకపోతున్నారా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. లోపం మీలో ఉందా, మీ వ్యవస్థలో ఉందా అని మండిపడ్డారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులను సైతం రోడ్డుమీదకి వైసీపీ ప్రభుత్వం తెచ్చిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

-->