Breaking News

టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా? ఎందుకో తెలుసా?

0 0

విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీమానా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం 100 శాతం ప్రైవేట్‌పరం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నానని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మ గౌరవం అని, విశాఖ ప్రజల గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీలో జరుగుతోన్న రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతను చవిచూడాల్సి ఉంటుందని గంటా ట్వీట్ చేశారు.