Breaking News

కరోనా టీకా వల్ల భారత్‌లో 8,563 మందికి తీవ్ర అస్వస్థత

0 0

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్ప‌టి వ‌ర‌కు 44 ల‌క్ష‌ల మంది క‌రోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 37 ల‌క్ష‌ల మందిని సంప్ర‌దించ‌గా, ఆ టీకా ప్ర‌భావం గురించి 5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స్పందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత 19 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు. అయితే వీరి మృతికి క‌రోనా టీకాతో ఎలాంటి సంబంధం లేద‌ని, ఇత‌ర జ‌బ్బుల కార‌ణంగానే చ‌నిపోయార‌ని అధికారులు పేర్కొన్నారు. తొలి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 97 ల‌క్ష‌ల మంది హెల్త్ వ‌ర్క‌ర్స్ క‌రోనా టీకా తీసుకున్నారు. తొలి ద‌శ‌లో క‌రోనా టీకా తీసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఈ నెల 13 నుంచి రెండో డోస్ టీకా ఇవ్వ‌నున్నారు.