Breaking News

మాట మార్చిన జగన్.. వాళ్లకు ట్యాబ్‌లేవి?

0 0

ఏపీలో అబద్ధాల పాలన కొనసాగుతోంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉచితంగా ఇస్తున్నామంటూ సీఎం జగన్ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీని మాత్రం మరిచిపోయారు. గతంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా.. తాజాగా 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ట్యాబ్‌లు ఇవ్వడాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఈ మేరకు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

‘జగన్ రెడ్డి 9,10,11,12 తరగతుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తానని హామీ ఇచ్చాడు. ల్యాప్ టాప్ కావాలంటూ 7 లక్షల మంది కావాలని ఆప్షన్ పెట్టుకుంటే, ఒక్కోదానికి రూ.26,000లు చొప్పున రూ.1820 కోట్ల భారం పడుతుందని, అమ్మఒడి అయితే రూ.13,000తో అంటే రూ.910 కోట్లతో పోతుందని.. ల్యాప్ టాప్ ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఇప్పుడు కేవలం 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఒక ట్యాబ్ ఇచ్చి, చేతులు దులుపుకున్నాడు’ అంటూ ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను టీడీపీ కూడా షేర్ చేయడంతో ప్రజలందరూ జగన్‌పై మండిపడుతున్నారు.