నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ క్రిస్మస్ కానుకగా ఈనెల 24న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా నాని రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించాడు. బెంగాల్ నేపథ్యం ఉన్న కథను తీసుకుని చిత్ర యూనిట్ ఓ సందేశం ఇచ్చింది. ఈ సినిమాకు సాయిపల్లవి నటన ఎంతో ప్లస్ అయ్యింది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.
కాగా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ను కూడా ప్రకటించింది. జనవరి 26 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈనెల 28వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఓవర్సీస్లో కలిసి రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. విజయానికి ఇంకా రూ. 3 కోట్ల దూరంలో ఉంది.