Breaking News

శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ మూవీ ఓటీటీ డేట్

1 0

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘రాజ రాజ చోర’ మూవీ ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 8 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ప్రకటన చేసింది. ఈ మూవీలో సునయన, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటించారు. యూత్ ను ఆకట్టుకునే వినోదంతో పాటు.. కాస్తంత సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు హసిత్ గోలీ అందించాడు. నటీనటుల నటనతో పాటు వివేక్ సాగర్ సంగీతం కూడా ఆకట్టుకుంది. కాగా ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.