Breaking News

మ‌హేష్ ‘గుంటూరు కారం’ ఆగిపోయిందా?

1 0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న‌ లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మూవీపై సోష‌ల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ న‌డుస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింద‌ని.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ల‌ను మారుస్తున్నార‌ని విప‌రీతంగా ప్ర‌చారం న‌డుస్తోంది. అయితే హీరోయిన్ పూజాహెగ్డే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ మూవీ నుంచి త‌ప్పుకుంద‌ని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌మ‌న్ కొన‌సాగుతాడ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అత‌డి స్థానంలో త‌మిళ సంచ‌ల‌న సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్‌ను తీసుకుంటున్నార‌నే వార్త అవాస్త‌వ‌మ‌ని తేల్చి చెప్పింది. ఈ సినిమా షూటింగ్ జూలై తొలివారం నుంచి రెగ్యుల‌ర్‌గా జ‌రుగుతుంద‌ని.. తాము ప్ర‌క‌టించిన ప్ర‌కారం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌వుతుంద‌ని తెలిపింది. కాగా ఈమూవీలో మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.