కన్నడ మూవీ ‘కాంతార’ అనూహ్య విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో పాపులర్ అయిన హోంబలే సంస్థ నిర్మించింది. దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నెలలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది.
అయితే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాను హీరోగా నటించాలని భావించలేదట. కేవలం దర్శకత్వం ఒక్కటి చూసుకుంటే చాలని అనుకున్నాడంట. ఈ ప్రాజెక్టును అగ్ర హీరోతో చేయాలని రిషబ్ శెట్టి కలలు కన్నాడట. అలా ఓ అగ్ర హీరో దగ్గరకు వెళ్లి కాంతార కథను చెప్పినట్లు ఇప్పుడు టాక్ నడుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమా స్టోరీని పునీత్కు చెప్పినప్పుడు అతడు థ్రిల్ అయ్యాడట. కథ వింటే తన రోమాలు నిక్కపొడుచుకున్నాయని.. కానీ ఇది నువ్వే చేస్తే ఇంకా సహజంగా ఉంటుందని రిషబ్ శెట్టికి పునీత్ సూచించాడట. దీంతో రిషబ్ శెట్టి ఈ మూవీలో విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు ఈ మూవీతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో గొప్పనటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.