Breaking News

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది

1 0

పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చాలా పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉన్నాయి. డైలాగులతో పాటు థమన్ బీజీఎం ఆకట్టుకుంటోంది. ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావు అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ డైలాగ్ రానా చెప్తాడు. దీనికి రఘుబాబు.. ఇది పులులు తిరిగే ప్రాంతం అని చెప్పగా.. పులి పెగ్గు వేసుకుని పడుకుందిలే అంటాడు రానా. అటు నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం.. వాడికి అంటూ పవన్ చెప్పే డైలాగ్ సూపర్బ్. నిత్యామీనన్ కూడా ట్రైలర్‌లో అలరించింది. మొత్తానికి ట్రైలర్ తుఫాన్‌ పుట్టిస్తోంది. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో భీమ్లా నాయక్ విడుదలవుతోంది. కాగా ఈనెల 23న భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది.