Breaking News

ట్రైలర్ టాక్: ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే… ఆర్.ఆర్.ఆర్ కథ ఇదేనా?

2 0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ట్రైలర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే ఒక్క విషయం స్సష్టంగా అర్ధమవుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలుత స్నేహితులు కాగా ఓ యుద్ధంలో వారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత మరో జన్మలో వాళ్లు మళ్లీ కలుసుకుంటారు. అప్పుడు గోండు బెబ్బులిగా కొమరం భీమ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్ కనిపిస్తారు. అయితే పోయిన జన్మలో స్నేహితులుగా ఉన్న వాళ్లు ఇప్పుడు శత్రువులుగా మారతారని.. చివర్లో భీమ్‌తో చేతులు కలిపి బ్రిటీష్ వారిని రామ్ ఎలా ఎదుర్కొంటాడు అన్నదే మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

ఇక ట్రైలర్ అయితే యాక్షన్ సీక్వెన్స్, డైలాగులతో విజువల్ ఫీస్ట్‌గా ఉందనే చెప్పాలి. ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతనే అంటూ భీమ్ చెప్పే డైలాగ్‌తో పాటు భీమ్… ఈ నక్కల వేట అంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం అంటూ రామ్‌ చెప్పే డైలాగులు మెగా, నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మూడు నిమిషాల 7 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ తొలుత థియేటర్లలో విడుదలైంది. దీంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. కాగా ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.