Breaking News

వైసీపీ నేతలు అసలు ఏమన్నారు? చంద్రబాబు ఎందుకు ఏడ్చారు?

1 1

ఏపీ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో చర్చ నడుస్తున్న సమయంలో ఓ ఎమ్మెల్యే… లోకేష్ ఎలా పుట్టాడో తెలుసుకో చంద్రబాబూ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆ ఎమ్మెల్యేను వారించారు. అనంతరం మంత్రి కొడాలి నాని కూడా తన నోటికి పని చెప్పాడు. ఆ లోకేష్ గాడు ఎలా పుట్టాడో వాడికే తెలియదు అంటూ ఆరోపించాడు. ఈ మాటలే చంద్రబాబును బాధించాయని.. తన భార్యపై అసభ్యంగా మాట్లాడారని ఆవేదన చెంది ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే అసెంబ్లీలో జరిగిన ఈ సంభాషణపై స్పీకర్ ఫుటేజ్ విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.