Breaking News

ఆసక్తిని కలిగిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ ట్రైలర్

1 0

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రారంభంలో పూజా హెగ్డే చెప్పే మాటలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫ్రేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్, బన్నీ వాసు, ప్రముఖ దర్శకుడు వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 15న ఈ మూవీ విడుదల కానుంది.