సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు, వైసీపీ అభిమానుల మధ్య రణరంగమే నడుస్తోంది. రిపబ్లిక్ మూవీ ఆడియో ఫంక్షన్లో ఏపీ సర్కారుపై పవన్ చేసిన ఆరోపణలతో వైసీపీ అభిమానుల్లో రోషం పొడుచుకువచ్చింది. దీంతో పవన్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైసీపీకి గుడ్డిగా మద్దతు ఇచ్చే పోసాని కృష్ణమురళి కూడా రంగంలోకి దిగాడు. సెకండ్ వేవ్ ముందు నుంచి సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంటే ఏనాడు మీడియా ముందుకు రాని పోసాని.. ఏపీ మంత్రులపై పవన్ ఆరోపణలు చేయగానే మేల్కొన్నాడు.
పనిలో పనిగా పవన్కు పంజాబీ అమ్మాయితో లింకు పెట్టాడు. ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాల్సిన పోసాని.. నోరు ఉంది కదా అని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో యుద్ధానికి గేట్లు ఎత్తాడు. పవన్కు పంజాబీ అమ్మాయి(తెలుగు సినిమా హీరోయిన్)తో లింకు ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదని పోసాని గ్రహించలేకపోయాడు. టీడీపీ అంటే చంద్రబాబు వెన్నుపోటు.. పవన్ కళ్యాణ్ అంటే అతడికి ముగ్గురు, నలుగురు పెళ్లాలు అన్న ఆరోపణలు చేయడం ఇటీవల వైసీపీ అభిమానులకు ఫ్యాషన్గా మారింది. ఇప్పటివరకు సినిమా వాళ్లకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో సీఎం జగన్ను ప్రశ్నించడం చేతకాని పోసాని.. పవన్పై ఆరోపణలు చేయడానికి మాత్రం ప్రెస్మీట్ పెట్టాడు. ఈ అంశం గురించే పవన్ లేవనెత్తగా.. సమాధానం ఇవ్వలేని మంత్రి పేర్నినాని గారు పవన్పై కులం, పెళ్లాలు అంటూ ఆరోపణలకు దిగారు. మా కులపోడు అంటూ పవన్పై నీచమైన కామెంట్లు చేశారు. వైసీపీ అభిమానులు ఇంకా ఈ పద్ధతి ఎన్నాళ్లు కొనసాగిస్తారో వేచి చూడాలి.