Breaking News

అయ్యన్నపాత్రుడివి బూతులు అయితే.. కొడాలి నాని తిట్టేవి ఏంటి?

2 0

వెనకటికి ఒక సామెత ఉంది. గురుగింజ తన నలుపును తాను చూసుకోలేదని. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల తీరు కూడా అలాగే ఉంది. గురువారం కోడెల వర్థంతి సభలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. మరుగుదొడ్డికి కూడా ట్యాక్స్ వేసేవాడిని ఏమంటారు? చెత్త నా… అని ప్రజలు తిట్టరా అని నిలదీశారు. ఈ మాటకు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అయ్యన్నపాత్రుడు ఏదో నేరం చేసినట్లు వైసీపీ మీడియా తెగ హైరానా పడుతోంది.

మరి గతంలో చంద్రబాబును అరేయ్.. అని, నా.. అని, దొంగ నా … అంటూ పలుమార్లు మంత్రి కొడాలి నాని తిట్టినప్పుడు వైసీపీకి మద్దతు పలికే మీడియా ఛానళ్లు ఏం చేశాయని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రజలకు మంచి చేసే విషయాలు చూపాల్సిన మీడియా ఒకరి సంకలు నాకుతూ ఇలా ప్రవర్తించడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. అయ్యన్న మాటల్లో తప్పేముందని.. ప్రజలు అనుకుంటున్న విషయాలనే ఆయన ప్రస్తావించారని అంటున్నారు. గతంలో బూతులు మాట్లాడిన వైసీపీ నేతలు పత్తిత్తులు అయితే ఇప్పుడు బూతులు మాట్లాడిన టీడీపీ నేతలు కూడా పత్తిత్తులే అవుతారని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.