Breaking News

స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడ్డ మెగా హీరో సాయిధరమ్ తేజ్

1 0

మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నుంచి జారిపడి అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని తొలుత పోలీసులు మాదాపూర్‌‌లోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే మెరుగైన వైద్యం కోసం అనంతరం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న మెగా కుటుంబసభ్యులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నిహారిక వంటి వారు ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీస్తున్నారు.