Breaking News

విశ్వక్‌సేన్ ‘పాగల్’ ఓటీటీ డేట్

1 0

విశ్వక్‌సేన్ నటించిన ‘పాగల్’ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 3న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.

కాగా బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో నివేదా పెతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు రాధన్ సంగీతం సమకూర్చాడు. కరోనా సమయంలోనూ తమ మూవీకి బాగానే కలెక్షన్లు వచ్చాయని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ వెల్లడించాడు. తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమాల ఓపెనింగ్స్ చూసి రాత్రికి రాత్రే ఆగస్టు 14న ఈ మూవీని రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉందన్నారు.