Breaking News

బుల్లితెరపై ఇక రికార్డులే.. ఎన్టీఆర్ ‘షో’ డేట్ వచ్చేసింది

1 0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. జూ.ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ఎప్పటినుంచి ప్రసారం కానుందో తెలిసిపోయింది. ఈ షో జెమినీ టీవీలో ఈనెల 22 నుంచి ప్రసారం కానుంది. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు.. ‘ప్రతి ఇంటికీ వచ్చేస్తున్నా..’ అంటూ సాగే ఎన్టీఆర్ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆగస్టు 22న ఈ షోకు సంబంధించి కర్టెన్ రైజర్ జరుగుతుంది. ఆగస్టు 23 నుంచి రెగ్యులర్ షో టెలికాస్ట్ కానుంది.