‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ మూవీ కథ గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యూరప్ బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీ కథ లీకైనట్లు తెలుస్తోంది. ఇంతకీ కథ ఏంటంటే.. యూరప్లో చాలా ఏళ్ళ క్రితం ఓ రైలు మిస్ అయింది. అప్పట్లో దాని గురించి ఎంత వెతికినా దొరకలేదట. మళ్లీ ఆ రైలు మెక్సికోలో ప్రత్యక్షమైందట. అయితే ఆ ట్రైన్ ఎలా యూరప్ నుంచి మెక్సికో వెళ్లిందో ఎవరికీ తెలియ రాలేదట.
ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలోనూ ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణిస్తున్న రైలు ఓ గుహలోకి వెళ్లగానే కనిపించకుండా పోతుందట. అప్పుడు అలా ఆ ఇద్దరు 1970 బ్యాక్డ్రాప్లోకి వెళ్తారట. అక్కడ వారి మధ్య పుట్టే ప్రేమ.. ఇతర విషయాలతో సినిమా పీరియాడికల్ స్టైల్లో ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ కథ నిజామో, కాదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.