Breaking News

ఆకట్టుకుంటున్న మణిరత్నం ‘నవరస’ ట్రైలర్

1 0

తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా వస్తున్న వెబ్ సిరీస్ ‘న‌వ‌ర‌స‌’. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ డిజిట‌ల్ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుద‌ల‌వుతోంది. ఈ వెబ్‌ సిరీస్ ట్రైల‌ర్‌ను మంగళవారం నెట్‌ఫ్లిక్స్ విడుద‌ల చేసింది.

హీరో సూర్య‌, విజ‌య్ సేతుప‌తి, సిద్ధార్థ్‌, అర‌వింద‌స్వామి, ప్ర‌కాశ్‌రాజ్‌, రేవ‌తి, అంజ‌లి, అధ‌ర్వ‌ముర‌ళి. ప్ర‌గ‌తి త‌దిత‌రులు ఈ వెబ్ సిరీస్ లో నటించారు. మాన‌వ జీవితంలోని తొమ్మిది ర‌సాలు(భావోద్వేగాలు) కలయికతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. వీటిని తాజా ట్రైలర్‌లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని కరోనా కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికుల‌కు అంద‌జేయ‌డానికి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ నిర్ణ‌యం తీసుకుంది.