Breaking News

పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా

0 0

టీమిండియా శ్రీలంక పర్యటనలో కరోనా కలకలం రేగింది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న వేళ టీమిండియా ఆటగాడు కరోనా బారిన పడినట్లు బహిర్గతమైంది. దీంతో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా.. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మ్యాచ్ రేపటికి వాయిదా పడింది.

కృనాల్ పాండ్యాకు కరోనా రావడంతో మిగతా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. వాళ్లకు కరోనా నెగిటివ్ వస్తే బుధవారం మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రకటించింది. కాగా కృనాల్ పాండ్యా తొలి టీ20కి దూరంగా ఉన్నాడు.