Breaking News

జూలై 9న నేరుగా ఓటీటీలో.. రవిబాబు కొత్త సినిమా

1 0

టాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్‌’.

కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటంతో ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. జూలై 9 నుంచి ‘క్రష్’ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ను టార్గెట్ చేసి ఈ సినిమాను రవిబాబు తెరకెక్కించారు.