Breaking News

జూలై 2 నుంచి ‘ఆహా’లో రష్మిక కొత్త సినిమా

2 0

యాక్షన్ కింగ్ అర్జున్ కుమారుడు ధృవ సర్జా, బ్యూటీ హీరోయిన్ రష్మిక నటించిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘పొగరు’ తెలుగు వెర్షన్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూలై 2 నుంచి ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్లు ఆహా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ మూవీలో ‘కరాబు’ అనే పాట ఎంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 19న తెలుగులో విడుదలైన మూవీ ఎట్టకేలకు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రాబోతుంది. ప్రతాప్ రాజు నిర్మించిన ఈ సినిమాకు నందన్ కిషోర్ దర్శకత్వం వహించాడు. చందన్ శెట్టి ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు.