Breaking News

కేసీఆర్‌ను గాంధీ ఆస్పత్రిలో చేర్చాలని డిమాండ్

0 0

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎంవీ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యం క్రిటికల్‌గా మారితే సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని చేసిన ప్రకటన తెలంగాణ రాష్ట్రమంతా దుమారం రేపుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు బెడ్లు ఖాళీగానే ఉన్నాయని ప్రభుత్వం చెప్తోందని.. మరి కేసీఆర్‌ను గాంధీ ఆస్పత్రిలో కాకుండా యశోదా ఆస్పత్రిలో ఎందుకు చేర్పిస్తారని.. ఆయన ఫాంహౌస్‌లో వైద్యం తీసుకోవడం సరికాదని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్‌ను గాంధీ ఆస్పత్రిలో చేర్చి పేద ప్రజలకు నమ్మకం కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియా మొత్తం హోరెత్తి పోతోంది.