Breaking News

మార్చి 12 నుంచి ఓటీటీలో ‘నాంది’

1 0

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత అల్లరోడి ఖాతాలో ఓ హిట్ పడింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో వచ్చేస్తోంది. మార్చి 12 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది. నరేష్ ఎన్నో కామెడీ సినిమాలు చేసినా కూడా దరిచేరని విజయం.. సీరియస్ సబ్జెక్ట్ చేసినపుడు దక్కింది . దాంతో ఇకపై కూడా ఇలాంటి సీరియస్ సినిమాలే చేయడానికి అల్లరోడు సిద్ధమవుతున్నాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చాడు.