Breaking News

ఓటుకు రూ.8వేలు ఇస్తున్నారు

1 0

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. పరపతి, హోదా కోసం నేతలు ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. ప్రెసిడెంట్ పదవికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా పలు పార్టీల నేతలు వెనుకాడడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవిని జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. రెండో దశలో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన ఓ నేత తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామంలోని 240 ఓట్లకు రూ.20 లక్షలు చెల్లిస్తానని సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు ఓక్కో ఓటరుకు పంచేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో ఒక్కో ఓటుకు రూ.8వేల వరకు ఆ అభ్యర్థి పంచుతున్నట్టు అర్థమవుతోంది.