Breaking News

వీడేం మొగుడురా బాబూ?

0 0

బెంగళూరులో ఓ వ్యక్తి తన కీచక బుద్ధిని బయటపెట్టాడు. మూడేళ్ల కిందట తనతో విడిపోయిన భార్య ప్రైవేట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు సంతోష్ అనే మెకానిక్‌ను వివాహం చేసుకుని మూడేళ్ల కిందట విడిపోయింది. అప్పటికే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ విడిపోయినా సంతోష్‌ తరచూ బీటీఏం ఫస్ట్‌ స్టేజ్‌ ప్రాంతంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి వేధించేవాడు. నిందితుడు ఇటీవల ఆమెను కించపరిచేలా కొన్ని ప్రైవేట్‌ ఫోటోలను తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలను అతను తన స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపాడు. గత వారం సంతోష్‌ తమ ఇంటికి వచ్చి తనతో గొడవ పడ్డాడని ,కోర్టులో ప్రస్తుతం కుటుంబ కేసు నడుస్తోందని బాధితురాలు వాపోయింది. వాట్సాప్‌లో తన ఫోటోలను సంతోష్‌ షేర్‌ చేసిన విషయం తన సోదరి తనకు తెలిపిందని, ఈ ఫోటోలను అందరూ చూశారని తెలిసిందని ఆమె ఆరోపించింది. దీంతో సంతోష్‌పై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ కోసం గాలిస్తున్నారు.