Breaking News

ధోనీ ఖాతాలో మరో రికార్డు

0 0

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అయినా రికార్డులు అతడి వెంటే పరిగెడుతున్నాయి. అతడు ఐపీఎల్ ఆడుతుండటంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అతడు మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రూ.150 కోట్ల సంపాదన అందుకున్న తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఈ ఏడాది ధోనీతో ఒప్పందం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్ రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని ప్రకటించింది. దీంతో అతడు ఐపీఎల్‌లో జీతభత్యాల ద్వారా ఇప్పటివరకు రూ.152 కోట్లు సంపాదించాడు. ఈ జాబితాలో ధోనీ తర్వాత రోహిత్ (146 కోట్లు), కోహ్లీ (143 కోట్లు) ఉన్నారు. 2008లో ఐపీఎల్ వేలంలో రూ.6 కోట్లకు ధోనీ అమ్ముడుపోగా 2014లో అతడి ధర రూ.12.5 కోట్లకు చేరింది. తాజాగా అతడి వేతనం రూ.15 కోట్లు అయ్యింది.