Breaking News

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్తీ

0 0

ఏపీలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో నాదెండ్ల మనోహర్ సమావేశమై ఏఏ స్థానాల్లో తమ పార్టీలు పోటీ చేయాలనే అంశంపై చర్చలు చేపట్టారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ భేటీకి కొనసాగింపుగానే ఇవాళ సమావేశం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీల కార్యాచరణ ఉండబోతున్నట్లు సమాచారం. అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసే విషయంపై బీజేపీ-జనసేన పార్టీలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.