Breaking News

మళ్లీ తప్పులో కాలేసిన ఏపీ సర్కారు

0 0

పంచాయతీ ఎన్నికలపై ఈరోజు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రధాన పత్రికలకు పెద్ద పెద్ద పేపర్ యాడ్‌లను ఇచ్చింది. అయితే ఇందులో కనిపించే గ్రామ పంచాయతీ కార్యాలయంపై తెలంగాణ ప్రభుత్వ లోగో కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వైసీసీపై ఓ రేంజ్‌లో మీమ్స్ వస్తున్నాయి. అన్నింటిని తెలంగాణ నుంచి కాపీ కొడుతున్నారని ఇప్పటికే జగన్ సర్కారుపై మచ్చ ఉంది. ఈరోజు ఇచ్చిన ప్రకటనలోనూ గ్రామపంచాయతీ కార్యాలయం తెలంగాణది ఉండటంతో మరోసారి ఏపీ అధికారులు లోపభూయిష్టంగా పనిచేస్తున్నారని స్పష్టమవుతోంది. ఏపీలో ఒక్క పంచాయతీ కార్యాలయం ఫోటో కూడా ప్రభుత్వం దగ్గర లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాల అభిమానులు అధికార పార్టీకి ప్రశ్నలు వేస్తున్నారు.