Breaking News

ప్రిన్స్ మహేష్ అందుకే దుబాయ్ వెళ్లాడా?

1 0

ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ప్రిన్స్ మహేష్‌బాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చింది. అమెరికా నుంచి రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో మహేష్ పాల్గొంటాడని అందరూ భావించారు. కానీ మహేష్ ఫ్యామిలీ ఉన్నపళంగా మళ్లీ దుబాయ్ వెళ్లింది. అయితే వాళ్లు దుబాయ్ వెళ్లడం వెనుక ఓ కారణముందని తెలుస్తోంది. ఈనెల 22న మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్ డే వేడుకలను దుబాయ్‌లో జరుపుకోవడానికి మహేష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈఈ వేడుకలు కాగానే మహేష్ దుబాయ్‌లోనే ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటాడు. ఈ మేరకు ఫిబ్రవరి తొలివారంలో మూవీ యూనిట్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ సంగీత దర్శకుడు.