Breaking News

సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

0 0

ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. గురువారం అతడు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. దీంతో మంత్రి అతడికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు. కాగా ఆసీస్ టూర్‌ను తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని, ఈ టూర్ తనకు చిరస్మరణీయంగా నిలిచిందని సిరాజ్ అన్నాడు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. కాగా అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ నేరుగా తన తండ్రి సమాధిని సందర్శించాడు. తన తండ్రి కలను నిజం చేసే అవకాశం తనకు దక్కినందుకు ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని సిరాజ్ వ్యాఖ్యానించాడు. కాగా సిరాజ్ ఆసీస్ పర్యటనలో ఉండగా ఆయన తండ్రి మరణించాడు. బీసీసీఐ అనుమతి ఇచ్చినా తన తండ్రి కల కోసం పార్ధివదేహాన్ని కడసారిగా చూడలేకపోయాడు.