Breaking News

మళ్లీ పెరిగిన బంగారం ధర

1 0

వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.575 పెరిగింది. దీంతో ఢిల్లీలో ధర రూ.49,125కి చేరింది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలో వెండి రూ.1,227 పెరగడంతో ఢిల్లీలో ధర రూ.66,699 పలుకుతోంది. ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. కాగా గత మూడు రోజుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల ఇలా ఉంది.
సోమవారం: బంగారం రూ.117; వెండి రూ.541
మంగళవారం: బంగారం రూ.198; వెండి రూ.1008
బుధవారం: రూ. 347; వెండి రూ.606