Breaking News

తెలుగు రాష్ట్రాలలో పెరిగిన డీమ్యాట్ ఖాతాలు

0 0

ఏపీ, తెలంగాణలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 9 నెలల కాలంలో డీమ్యాట్ ఖాతాల వృద్ధి 16 శాతం ఉంటే ఒక్క ఏపీలోనే అది 33 శాతంగా నమోదైంది. కొత్తగా ప్రారంభిస్తున్న ఖాతాల్లో హైదరాబాద్, విజయవాడల నుంచే అధికంగా ఖాతాలు ఉంటున్నాయి. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సగటు వయసు 27గా ఉంటుందని క్యాపిటల్ వయా పేర్కొంది. కాగా 2021లో నిఫ్టీ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. అటు మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారి కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్యాపిటల్ వయా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మదుపర్ల సమస్యలను పరిష్కరించనుంది.