Breaking News

తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్ల కోటా విడుదల

0 0

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. ఫిబ్రవరి నెల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 20వేల టిక్కెట్ల చొప్పున 17 శ్లాట్లకు సంబంధించి రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. ఒక యూజర్ ఐడీ నుంచి ఆరు టిక్కెట్లు బుక్ చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టిక్కెట్లతో పాటు అద్దె గదులను కూడా బుక్ చేసుకోవచ్చు.